హిందూపురంలో ఘనంగా వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు

హిందూపురం: జనసేన పార్టీ నాయకుడు కొణిదెల నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 34వ జన్మదినం సందర్భంగా హిందూపురం పట్టణంలోని గురునాథ్ థియేటర్ ఆవరణలో హిందూపురం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు చక్రవర్తి ఆధ్వర్యంలో 20 కేజీల కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ హిందూపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఆకుల ఉమేష్ హాజరయ్యారు. మెగా హీరోల సేవా కార్యక్రమలు హిందూపురంలో చేపట్టామని, ఇక ముందు కూడా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మెగా అభిమానులు కొల్లకుంట శేఖర్, వినయ్ రెడ్డి, లోకేష్, శివ, బాలాజీ, ప్రభు దాస్, మల్లికార్జున, విజయ్, ప్రజీత్, హనుమంతు, లింగరాజు, దివాకర్, అరిఫ్, రామకృష్ణ, నాసీర్, సోము, రఘు, ఇందు, మాస్, నవీన్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.