మదనపల్లెలో జనసేన ఆధ్వర్యంలో మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మదనపల్లెలో జనసేన నాయకులు నరేష్, అయాజ్, జాఫర్, సోను హర్ష, అశ్వత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలుఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన క్రియాశీలక కిట్లను పంపిణీని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మరియు జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్ ప్రారంభించి పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చాక వీధి నాయకులు కూడా నిన్ను తిట్టి పబ్లిసిటీతో పైకొచ్చేసారు.
నువ్వు రాజకీయాల్లోకి వచ్చాక నిక్కర్లు వేసుకున్న వాళ్ళు కూడా రాజకీయాల గురించి మాట్లాడేస్తున్నారు, నువ్వు రాజకీయాల్లోకి వచ్చి నువ్వు గెలిచి మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి, మాకు దిశా నిర్దేశం చేసావు. నువ్వు ఓడి మీడియా, పొలిటిషియన్స్ లైఫ్ సెటిల్ చేసావ్.! నువ్వు గెలిచినా ఉపయోగ పడ్డావు, ఓడిన ఉపయోగ పడ్డావు. నువ్వు గెలిచినా సింహామే, ఓడినా సింహామే, నిన్ను తిట్టుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళందరూ ఇప్పుడు
ఏదో పబ్బం గడుపుకుంటున్నారు అన్నయ్య. స్వయంకృషితో తెలుగు సినీ ప్రపంచంలో ఎవరి అండ లేకుండా పైకి వచ్చిన వాడిని అన్నయ్య నువ్వు తెలుగు సినీ పరిశ్రమలో కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న మొదటి వ్యక్తివి నువ్వే అన్నయ్య. నీ పేరు చెప్పుకుని ఎంతో మంది సినీ పరిశ్రమలో పైకి వచ్చారు. నీ సేవా కార్యక్రమాలు మాకు ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు అన్నయ్య . నీ ఆలోచనతో ఎన్నో కుటుంబాలు ఎన్నో జీవితాలు కాపాడగలిగావు నీవు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి అని
నీవు ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అధైర్యం, నిరాశ, నిస్పృహ వంటి మాటలు తెలియని నీ వెంట మా లాంటి అభిమానులు ఎంతో మంది ఉన్నారని జనసేన నాయకులు పేర్కొన్నారు.