జనసేనలో చేరిన కోతుల నడుమ గ్రామ యువకులు

తెలంగాణ, హుస్నాబాద్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు పార్టీ సిద్ధాంతాలు నచ్చి, ఎల్కతుర్తి మండలం, కోతుల నడుమ గ్రామ యువకులు, హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలో చేరిన యువతకు సముచిత స్థానం ఉంటుందని, మీకు ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉదృతం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు ఎల్కతుర్తి మండల ఉపాధ్యక్షుడు మేకల కిషన్, పొడిశెట్టి విజయ్, కొలుగూరి అనిల్, మోరె శ్రీకాంత్, ఎర్రోళ్ల వంశీ, మాట్ల ప్రవీణ్, విశాల్, శివాజీ, రాకేష్, నవదీప్, రామ్, కృష్ణ వంశీ, అరవింద్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.