పలు ఆత్మీయ పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకట లక్ష్మి సోమవారం రాజానగరం నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంచితనంతో, ప్రేమతో మంచి వాడుగా పేరున్న సీతానగరం మండలం మునికొడాలి గ్రామ వాస్తవ్యలు కీ. శే గగ్గల రామకృష్ణ అకాల మరణంతో కుటుంబం మొత్తం శోక సంద్రంలో మునిగి పోయింది. విషయం తెలియగానే జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకట లక్ష్మి హుటాహుటిన సీతానగరం మండలం మునికొడాలి గ్రామాన్ని సందర్శించి, రామకృష్ణ ఆత్మశాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబాన్ని ఓదార్చి, మనో ధైర్యం కలిగించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామ వాస్తవ్యులు కీ.శే. శ్రీమతి వి. వరహాలమ్మ స్వర్గస్తులైనారు. వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకట లక్ష్మి ఆ కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యం కలిగించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం రాజానగరం మండలం సంపత్ నగరం గ్రామ వాస్తవ్యులు కూరపాటి వెంకన్న బాబు అమ్మగారు కీ.శే. శ్రీమతి కూరపాటి అనంతలక్ష్మి స్వర్గస్తులైనారు. వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకట లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యం కలిగించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.