శ్రీరామ శోభాయాత్రను ప్రారంభించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజమహేంద్రవరం, శ్రీరామనవమి సందర్భంగా రాజమహేంద్రవరం శ్రీరామ ఉత్సవ సమితి వారు ఏర్పాటు చేసిన శ్రీరామ శోభాయాత్రలో భాగంగా పుష్కర్ ఘాట్ వద్ద నుండి సుమారు పదివేల బైకులతో అత్యంత శోభయమానంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజానగరం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి జెండాను ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా జాయింట్ కన్వీనర్ మేడిశెట్టి శివరాం గారు, భూపాలపట్నం సర్పంచ్ గుల్లింకల లోవరాజు, ప్రెసిడెంట్ గల్లా రంగా, వేగిశెట్టి రాజు, నాతిపాం దొరబాబు, వెలుగుబంద గోపాలం, అరిగెల రామకృష్ణ, రఘునాధపురం జనసేన నాయకులు బాబురావు, భూపాలపట్నం జనసేన పార్టీ పుణ్యక్షేత్రం ప్రెసిడెంట్ మదిరెడ్డి బాబు, వీర్రాజు, పాలచర్ల జనసైనికులు మరియు రాజానగరం జనసైనికులు భారీగా పాల్గొన్నారు.