నరసాపురం గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, నరసాపురం గ్రామంలో గురువారం పలు కుటుంబాలను జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. పెదపాటి సుబ్రహ్మణ్యం ఇటీవల జరిగిన యాక్సిడెంట్లో గాయపడిన విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. యర్రమళ్ళ లావణ్య ఆరోగ్యం బాలేదని విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన నాయకులు మట్ట వెంకటేశ్వర రావు, సొంగ తేజ, ప్రగడ జోగారావు, ప్రగడ దేవి, అడబాల బాబీ, దేవన దుర్గ ప్రసాద్ (డిడి), మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.