మహాయజ్ఞంలో పాల్గొన్న శ్రీమతి మాకినీడి శేషుకుమారి

  • శ్రీపాద శ్రీనివాస సాయి ఆధ్వర్యంలో సవితృకాఠకచే పారాయణం

కాకినాడ జిల్లా, పిఠాపురం పట్టణంలో 3వ రోజు శ్రీ శివసాయి దత్త బ్రాహ్మణ కాలనీలో శ్రీపాద శ్రీనివాస సాయి ఆధ్వర్యంలో జరిగిన సవితృకాఠక యజ్ఞానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రేతా యుగంలో శ్రీ భరద్వాజ్ మహర్షి వారిచే పిఠాపురంలో నిర్వహించబడిన యజ్ఞం పురాణాల ప్రకారం తెలుస్తుంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి ఆజ్ఞతో పిఠాపురంలో ఆగస్టు 23 నుంచి 27వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సవితృకాఠక యజ్ఞం జరుగుతున్నాయి. శ్రీపాద వల్లభుడు ఆశీస్సులతో యజ్ఞంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆ శ్రీపాద వల్లభుడు ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి సీఎం అవ్వాలని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామివారి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, జనసేన నాయకులు పుణ్య మంతుల మూర్తి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వేణు నారాయణరావు, మేళం బాబి, నెయ్యికాపుల సురేష్, కసిరెడ్డి నాగేశ్వరరావు, పబ్బినీడి దుర్గాప్రసాద్, నామ శ్రీకాంత్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.