అనకాపల్లి క్రియాశీలక వాలంటీర్లను సత్కరించిన పరుచూరి భాస్కరరావు

అనకాపల్లి, ఈ నెల 14న మచిలీపట్నంలో జరగనున్న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభకు అనకాపల్లి నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొనాలని నియోజకవర్గ ఇంచార్జ్, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు పిలుపునిచ్చారు. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి జనసైనికులు ఆవిర్భావ సభలో పెద్ద ఎత్తున పాల్గొనాలని అన్నారు. ఈ సందర్బంగా మూడవ విడత క్రియాశీలక సభ్యత్వం నమోదులో రికార్డు స్థాయిలో 6500 లకు పైగా సభ్యత్వాలు నమోదు చేసిన నియోజకవర్గ వాలంటీర్లకు అభినందన కార్యక్రమం నిర్వాహంచారు. ఈ సందర్భంగా 100 పైన సభ్యత్వాలు చేసిన వాలంటీర్లకు శాలువాలు మరియు షీల్డులతో సత్కరించారు. కశింకోట మండలం నుండి 150 కి పైగా సభ్యత్వాలను మజ్జి బాబ్జి, గూడెపు మణికంఠ, తోరం గణేష్ లు నమోదు చేయగా, గొంతిన ఈశ్వరరావు, ఊడి నూకరాజు, అఖిల్ శ్రీను, బలిజి వినయ్, సతీష్ లు 100 పైగా నమోదు చేశారు. ఇక 100లోపు సభ్యత్వాలు నమోదు చేసిన వారిలో గొంతిన లోవగిరి, కలిగెట్ల వీరబాబు, గనిరెడ్డి దినేష్, గూడుపు విశ్వేశ్వరరావు, చిన్ని జనార్దన్, సుంకర మహేష్, మండపాక రామ త్రినాధ్, కలగ గణేష్, సాయి (గొబ్బూరు) లు ఉన్నట్లు మండల నాయకులు తెలిపారు. ఈ సంవత్సరమే వాలంటీర్స్ గా చేస్తూ, గ్రామ స్థాయిలో మంచి సంఖ్యలో సభ్యత్వాలు చేయించిన వీరందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, షీల్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన నాయకులు, గ్రామ కమిటీల అధ్యక్షులు, కమిటీ సభ్యులు జనసైనికులు పాల్గొన్నారు.