మూసాపేట్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో ముమ్మారెడ్డి

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం, మూసాపేట్ డివిజన్, మోతీ నగర్ హనుమాన్ మందిర్ నుండి బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. మూసాపేట్ డివిజన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్తూ బిజెపి, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. డి.ఎస్.పి కాలనీ, పాండురంగరావు నగర్, కబీర్ నగర్, పప్పు గూడ, అవంతి నగర్, స్నేహపురి కాలనీ, రామారావు నగర్ వరకు పాదయాత్ర కొనసాగించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని, ఏ ఒక్కరితో మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే అవినీతి, భూకబ్జాల గురించి మాట్లాడుకుంటున్నారు. తప్పకుండా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బిజెపి, జనసేనతో మార్పు తద్యమని మీ అందరిని చూస్తే అర్థమవుతుంది. కనుక మీరందరూ మన ఎన్నికల గుర్తు అయినటువంటి గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్, ఎర్రస్వామి, కిషోర్, సద్గుణ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, నాగేంద్ర, సూర్య, జనసేన నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.