తాగు నీరు పైప్ లైన్ మరమ్మత్తులకు డబ్బులు వసూలు చేస్తున్న పురపాలక సంఘ సిబ్బంది

అమలాపురం: జనసేన కౌన్సిలర్ గొలకోటి అమలాపురం పురపాలక సంఘ సాధారణ సమావేశం చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి అధ్యక్షతన జరిగింది. కౌన్సిల్ సమావేశంలో జనసేన 9వార్డ్ కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి మాట్లాడుతూ మంచినీటి పైపులైను మరమ్మత్తులకు రూ.1.79 లక్షలు ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నించారు. వార్డులో ప్రజలు దగ్గర నుంచి ఈ పనులకు పురపాలక సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు అని 9 వార్డు జనసేన కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి ఆరోపించారు.