గుండవరం గ్రామములో నా సేన కోసం నావంతు

పొన్నూరు నియోజకవర్గం, చేబ్రోలు మండలంలోని గుండవరం గ్రామములో శనివారం సాయంత్రం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు చుక్కా నరేంద్ర ఆధ్వర్యంలో “నాసేనకోసం – నావంతు” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని అందరి సహకారంతో పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామస్థులకు మార్కండేయ బాబు ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భావించి జనసైనికులు పని చేయాలని ఆయన అన్నారు. అనంతరం మార్కండేయ బాబు ఇటివలే గుండవరం గ్రామానికి సంబంధించి ప్రమాదానికి గురైన జనసైనికుడు తుపాకుల గోపి గృహాన్ని సందర్శించి ఆయనను పరామర్శించి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, జిల్లా కార్యదర్శి మేకల రామయ్య యాదవ్, చేబ్రోలు మండల అధ్యక్షులు చందు శ్రీరాములు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.