పడమర గంగవరం గ్రామంలో “నా సేన కోసం నా వంతు”

దర్శి నియోజకవర్గం, కురిచేడు మండలం, పడమర గంగవరం గ్రామంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు “నా సేన కోసం నా వంతు” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు మరియు పడమర గంగవరం వార్డు మెంబర్ పసుపులేటి చిరంజీవి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడమే మన ముందున్న లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వరికూటి రమణయ్య, దాసరి అయ్యప్ప, వరికూటి రమేష్, గుమ్మిత చిన సుబ్బారావు, పసుపులేటి శ్రీనివాసరావు, మారాచు కోటేశ్వరరావు, పసుమర్తి గురు బాబు, కర్లకుంట ప్రసన్న, కొత్త జ్ఞానేశ్వర్ రెడ్డి, పసుపులేటి రమేష్, పసుపులేటి సూర్యనారాయణ, పసుపులేటి కృష్ణయ్య, కాట్రాజు వెంకటేష్, వేమా అజయ్, చవలం వెంకటేశ్వర్లు, పసుపులేటి కొండ, పరిమిశెట్టి గోపి, పసుపులేటి గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి జనసేన తరుపున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.