వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’

ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం, తానం చింతల గ్రామంలో జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమాన్ని ప్రారంభించి, జనసేన పార్టీ అధికార ఫోన్ పే నెంబర్ కు విరాళాలను పంపించడం జరిగినది. ఈ సందర్భంగా వరికూటి నాగరాజు మాట్లాడుతూ… నీతి, నిజాయితీలతో ఉన్న పార్టీ జనసేన అని, అధికారం లేకుండా జనసేన అధినేత తన సొంత ఖర్చులతో ఎంతో ప్రజాసేవ చేస్తున్నారని అలాంటి అధినేతకు అండగా ఉండేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరౌ తమవంతుగా పార్టీ అధికార ఫోన్ పే/గూగుల్ పే నెంబర్ 7288040505 కు విరివిగా విరాళాలు పంపించాలని కోరడం జరిగింది. ఎంత పంపించామన్నది కాదు ఎంత మంది భాగస్వాములయ్యారు అనేది ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.