గాజువాకలో ‘నాసేన కోసం నా వంతు’

గాజువాక నియోజవర్గం, ‘నాసేన కోసం నా వంతు’ అవగాహనా కార్యక్రమం జి.వి.ఎమ్.సి 85వ వార్డులో సోమవారం శనివాడ కాలనీలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు జి.వి.ఎమ్.సి 85వ వార్డు ఇంచార్జ్ గవర సోమశేఖర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెక్కాడితే కాని డొక్కాడని వారు కూడా తమకు తోచినంత జనసేన పార్టీకి విరాళాలు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.