రాయపరెడ్డి ఫౌండేషన్ సహకారంతో శ్రీమతి డొక్కా సీతమ్మ ఆహార నిధి

మాడుగుల నియోజకవర్గం, కె.కోటపాడు మండలంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల మేరకు శ్రీమతి డొక్కా సీతమ్మ ఆహార నిధి కార్యక్రమం సాయిబాబా ఆలయం వద్ద రాయపరెడ్డి ఫౌండేషన్ సహకారంతో ప్రారంభించడం జరిగింది. మాడుగుల నియోజకవర్గం నాయకులు రాయపరెడ్డి కృష్ణ మాట్లాడుతూ నెలలో ప్రతి మొదటి గురువారం అన్నదాన కార్యక్రమం చేసామని చెప్పారు. మిగతా మూడు వారాలు కూడా దేవరపల్లి మాడుగుల చీడికాడ మండలంలో కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేస్తామని తెలియజేశారు. కె.కోటపాడు మండలంలో ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు కె.కోటపాడు మండలం జనసేన నాయకులు జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కె.కోటపాడు మండలం జనసేన నాయకులు కుంచా అంజిబాబు, మూర్తి, పాలవెల్లి, ఉమా మహేష్, శివాజీ, శ్రీను, చైతన్య, సూర్య, వరహాలరాజు, మండల జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.