నెదర్లాండ్స్ చేరుకున్న నాగబాబు
* ఆమ్ స్టర్ డ్యామ్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు యూరోప్ పర్యటనలో భాగంగా శుక్రవారం నెదర్లాండ్స్ చేరుకున్నారు. ఆమ్ స్టర్ డ్యామ్ విమానాశ్రయంలో నాగబాబు గారికి ఎన్ ఆర్ ఐ జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఇక్కడ రెండు రోజుల పాటు నాగబాబు పర్యటిస్తారు. ఎన్ ఆర్ ఐ జనసైనికులు, వీర మహిళలతో సమావేశమవుతారు. గత పది రోజులుగా నాగబాబు యూకే, ఐర్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి ప్రవాస భారతీయులను కలిసి పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించిన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్ లో ఉన్న ప్రవాస భారతీయులను నాగబాబు కలిసి జనసేన పార్టీ భవిష్యత్తు కార్యక్రమాల మీద, పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రవాస భారతీయుల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశాలపైన చర్చిస్తారు.