అమరావతి రైతులకు నగరి రైతులు మద్దతు

నగరి ప్రాంత రైతులు అమరావతి రైతులకు మద్దతుగా వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మొక్కలు నాటి అమరావతికి రైతులకు మద్దతు ప్రకటించారు. ఆ తరువాత అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రైతు నాయకులు బ్రిటీష్ ప్రభుత్వం కంటే దారుణంగా జగన్ పాలన సాగుతోందన్నారు. 250 రోజులుగా అమరావతి రైతులు పోరాటం చేస్తుంటే బ్రిటీష్ వాళ్లు అయినా స్పందించి ఉండేవారన్నారు. జగన్‌కు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం దారుణం అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్రభుత్వాన్ని నగరి రైతులు డిమాండ్ చేశారు.