ఎన్డీఏ కూటమిదే విజయం

నెల్లూరు: మే 13న జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు తెలిపారు.చిల్లకూరు మండలం పారిచర్లపాలెం గ్రామంలో శనివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం ఎన్డీఏ అభ్యర్థుల విజయం కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అస్తవ్యస్తంగా మారిందని, రాజదాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలి పోయిందన్నారు. రాష్టాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వ సహకారంతో జనసేన, టీడీపీలు తీసుకుంటాయని తెలిపారు. జనసేన నాయకులు మనోజ్ కుమార్,మధు, మహబూబ్ బాషా, ఖాజ లు మాట్లాడుతూ ఎన్డీఏ హయంలోనే అభివృద్ధి సాధ్యమని, వైసిపి రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, ఎన్డీఏ ను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం సూపర్ సిక్స్, షణ్ముఖ వ్యూహం పదకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, యశ్వంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.