మచిలీపట్నం జనసేన కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

మచిలీపట్నం జనసేన కార్యాలయంలో ఇంచార్జి శ్రీ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా 2022 నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. శ్రీ బండి రామకృష్ణ మాట్లాడుతూ… ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరిని భగవంతుడు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో దీవించాలని కోరుకుంటున్నాను, జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల తరఫున ప్రజల కోసం పోరాటానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగో డివిజన్ ఇన్చార్జ్ వేణు, కార్పొరేటర్ నాగ ఛాయాదేవి, పెదయాదర సర్పంచ్ గల్లా తిమోతి, జొన్న నాగరాజు, మచిలీపట్నం మోకా రవి ఉపాధ్యక్షుడు ఎండి సమీర్, వివిధ డివిజన్లో ఇన్చార్జులు కర్రి మహేష్, ఎండి భాషి, ఉడుముల బుజ్జి, ఈ.మణిబాబు, వై. వాసు, గణేష్, యశ్వంత్, రామ్ జ్యోతి, తోట రాజేష్, ఎ.శ్రీను, జన్ను నాగరాజ్, తోట భాస్కర్ రావు, ఫణి, చక్రి, కొండా మేస్త్రి మరియు వీరమహిళలు పాల్గొన్నారు.