పెదఈర్లపాడు జనసేన ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

కనిగిరి: నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం పెదఈర్లపాడు జనసేన ఆధ్వర్యంలో స్థానిక ఎస్సీ కాలనీని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులతో కలసి బాప్టిస్టు చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేయడం జరిగింది. ఆ తరువాత కేక్ కటింగ్ చేసి, పిల్లలకి స్వీట్స్ మరియు చాక్లెట్ పంచడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ కాలనీ పెద్దలు మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి తమ కాలనీలో వీధి లైట్స్ ఏర్పాటూ చేసినందుకు జనసేన నాయకులు మాదాసు రమేష్ బాబుకి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ సందర్భంగా మాదాసు రమేష్ బాబు మాట్లాడుతూ కొత్త సంవత్సరం ఇలా అందరితో కలిపి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగా తనకు వీలైనంత సాయం అందించడానికి ఎప్పడు ముందుంటానని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పెద ఈర్లపాడు జనసేన నాయకులు కూడాల నగేష్, దాసరి అయ్యప్ప, మాదాసు మధు, సునీల్, పులి శ్రీకాంత్, తెలుగుదేశం నాయకులు మాదాసు చిన బ్రహ్మయ్య, మూలే మహేంద్ర, పాలురి మహేంద్రబాబు మరియు జనసైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.