వడ్రంగి సంఘం క్యాలెండర్ ని ఆవిష్కరించిన పోతిన మహేష్

విజయవాడ: నూతన సంవత్సరం సందర్భంగా 42వ డివిజన్ జనసేన పార్టీ కార్యాలయం నందు సోమవారం వడ్రంగి సంఘం క్యాలెండర్ ని విజయవాడ జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ మరియు 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వడ్రంగి కార్మికులు యర్రోజు సత్యనారాయణ చారి, కత్తురోజు సతీష్ కుమార్, శివప్రసాద్ చారి అమర్, నాగేశ్వరరావు జనసేన పార్టీ నాయకులు తిరుపతి సురేష్ దాసి రామ్మోహన్ తులసి మురళి తదితరులు పాల్గొన్నారు.