ఇప్పుడు సభ.. అనంతరం గ్రామాల దాహం తీర్చే ట్యాంకర్

మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు తరలివచ్చే పార్టీ శ్రేణుల దాహార్తి తీర్చేందుకు ఆ నియోజకవర్గం తరఫున ఏర్పాటు చేసిన తాగునీటి ట్యాంకర్ ను పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జెండా ఊపి ప్రారంభించారు. బహిరంగ సభ అనంతరం మంగళగిరి నియోజకవర్గం పరిధిలో తాగునీరు అందని గ్రామాల దాహార్తిని ఈ ట్యాంకర్ తీరుస్తుంది. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, తాడేపల్లి మండలాధ్యక్షులు సామల నాగేశ్వరరావు, దాసరి శివనాగేంద్రం, పార్టీ నాయకులు పాల్గొన్నారు.