శ్రీశ్రీశ్రీ విజయ కనకదుర్గ అమ్మవారికి అరకేజీ వెండి సమర్పణ

పిఠాపురం నియోజకవర్గం, యూ.కొత్తపల్లి మండలం, గోర్స గ్రామంలో మంగళవారం విజయదశమి సందర్భంగా అమ్మవారికి పి.ఎస్.ఎన్ మూర్తి జనసేన వర్కింగ్ టీమ్ అరకేజీ వెండి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ జోగా రమణ, జనసేన నాయకులు పిండి శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు జనసేన నాయకులు గ్రామస్తులు ఘనస్వాగతం పలికి సాలువతో సత్కరించి ఆహ్వానం పలికారు. ముఖ్య అతిథులుగా విచ్చేసి మమ్మల్ని ఆనందంపచేశారు. గోర్స గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీపై ఈ కార్యక్రమంలో గోర్స గ్రామ ప్రజలు, జనసేన నాయకులు ఉలవల శ్రీనివాస్, జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి పెద్దిరెడ్ల దొరబాబు, మణికంఠ, గణేష్, మధు, మద్దాల వీరబాబు, నాగేంద్ర, బత్తుల శివ, బొజ్జ త్రిమూర్తులు, పెద్దిరెడ్ల నాగేంద్ర, వెన్న తతిలు, ఏరిపిరెడ్డి కొండబాబు, పిఠాపురం నాయకులు కర్రి కాశీ విశ్వనాథ్, కసిరెడ్డి నాగేశ్వరరావు, పెంకే జగదీష్, పెదిరెడ్ల భీమేశ్వరరావు, కోలా దుర్గాదేవి, ముప్పన రత్నం, చర్ల గీత, తోట సతీష్, పబ్బిరెడ్డి ప్రసాద్, బండి అప్పారావు, ఎంపీటీసీ అభ్యర్థులు కేతినీడి గౌరీ నాగలక్ష్మి, గింజల మహాలక్ష్మి, పి.ఎస్.ఎన్ మూర్తి మరియు ఆలయ కమిటీసభ్యులు, జనసేన పార్టీ నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.