రెండు గ్రామాలకు ఒకరే టీచర్

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం తోటవాడ పంచాయతీ కుమ్మవలస గ్రామ ప్రాథమిక పాఠశాలలో టీచర్ లేక పిల్లల చదువులు కుంటుపడుతున్నాయని జనసేన పార్టీ నాయకులు కోరుకొండ మల్లేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం ఈ స్కూలు టీచర్ బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఇదే పరిస్థితి. పక్క గ్రామ టీచర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అంటే రెండు స్కూళ్లకి ఒకే టీచర్ అన్నమాట. ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు.