హుస్నాబాద్ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభం

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గం, నియోజకవర్గ నాయకులు తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టి సిద్ధాంతాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బండి శరత్, లక్కిరెడ్డి, హిమవంత్, ప్రశాంత్, నిఖిల్, అభిలాష్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.