రైతు భరోసా యాత్ర గోడ పోస్టర్ ను ఆవిష్కరించిన సిఎస్ పురం జనసేన

ప్రకాశం జిల్లా, సిఎస్ పురం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఆప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న 3000 మంది కౌలు రైతు కుటుంబాలను విడతల వారిగా పరామర్శించి కుటుంబానికి 1 లక్ష రూపాయలు చొప్పున మొత్తం 30 కోట్ల రూపాయల సొంత నిధులతో జనసేన రైతు భరోసా యాత్ర చేస్తున్న సందర్బంగా గోడ పోస్టర్ ను ప్రకాశం జిల్లా, సిఎస్ పురం మండల అధ్యక్షులు జానపాటి రాజశేఖర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సుబ్బారాయుడు, ఊస శ్రీను, బాబు, రాజా, తదితరులు పాల్గొన్నారు.