పారిశుద్ధ్య పనులు చేపట్టండి: జనసేన నాయకులు యు.పి.రాజు

రాజాం మున్సిపల్ కమిషనర్ డి.టి.వి కృష్ణారావుకి రాజాం మున్సిపాలిటీ పరిధిలో గల బుచ్చిం పేట గ్రామంలో పారిశుద్ధ్య సమస్యపై జనసేన పార్టీ రాజాం నియోజకవర్గ నాయకులు యు.పి.రాజు వివరిస్తూ వినతి పత్రం అందచేశారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని తెలియచేసారు. యు.పి.రాజుతో పాటు ఎంపీటీసీ అభ్యర్థి సామంతుల రమేష్, నమ్మి దుర్గారావు, రామకృష్ణ, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.