మన పార్టీ – మన బాధ్యత, రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయండి

  • జనసేన మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్

గురజాల నియోజకవర్గం: జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న మన ఒక్కరోజు సంపాదన, జనసేన కోసం, మన పార్టీ మన బాధ్యత కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని పిడుగురాళ్ల మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ జనసేన కార్యకర్తలు సెప్టెంబరు 2న స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ మన పార్టీ మన బాధ్యత అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఒక్క రోజు సంపాదన జనసేన కోసం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారని తెలియజేశారు. అదేవిధంగా మెగా రక్తన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. అధికారంలో ఉండి కూడా ఏ పార్టీ చేయనటువంటి పనులు, అధికారం లేకపోయినప్పటికీ కొన్ని కోట్లు ప్రజల కోసం ఖర్చు పెడుతూ భావితరాల భవిష్యత్తు కోసం పార్టీని నడిపిస్తున్న అధినేతకు తోడుగా మేము సైతం అంటూ లక్షలాదిమంది స్వచ్ఛందంగా సెప్టెంబర్ 2న పార్టీ అఫీషియల్ గా ఇచ్చినటువంటి యుపిఐ నెం 7288040505, 7288040505 ఫోన్ పే, గూగుల్ పే, పార్టీ అకౌంట్ ద్వారా విరివిరిగా అమౌంట్ వేసి, ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ పార్టీకి అండగా ఉన్నామనే భరోసా నాయకునికి కల్పించే గొప్ప కార్యక్రమాన్ని చేయబోతున్నామని తెలియజేశారు. ప్రతి ఒక్క జనసేన అభిమాని, మరియు కార్యకర్త, జనసేనాని ఆశయ సాధన కోసం తోడుగా నిలబడాలని కోరారు. బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ ఫోన్ 9032235492 నెంబర్ కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరని తెలియజేశారు.