మన సీతానగరం-మన జనసేన

జనసేన సిద్ధాంతాలని ప్రతి గ్రామానికి, ఇంటికి చేరవేసే క్రమంలో “మన సీతానగరం-మన జనసేన” కార్యక్రమానికి శ్రీకారం చుట్టటం జరిగింది. మొదటివిడతగా కాసయ్యపేట గ్రామాన్ని పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం నాయకులు సందర్శించి.. ప్రజాసమస్యలు తెలుసుకొని, ఆ సమస్యల పట్ల తమదైన సహకారం ఉంటుంది అని హామీనిస్తూ.. పార్టీ సిద్ధాంతాల్ని ప్రజలకి చేరువ చేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు పైల సత్యన్నారాయణ, అల్లు రమేష్, మురళి మరియు సీతానగరం మండల నాయకులు ప్రకాష్, వెంకటరమణ, జై ప్రకాష్, దామోదర్, జగదీశ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు. ఇందులో పైల సత్యన్నారాయణ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపర్చటమే మా అంతిమ లక్ష్యం.. మిగిలిన 43 గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం చేసి పార్టీని బలోపేతం చేస్తాం అని చెప్పటం జరిగింది.