అక్రమ అరెస్టులపై స్పందించిన పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ

విశాఖపట్టణం, ఆదివారం విశాఖపట్టణంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనసేన భరోసా జనవాణి కార్యక్రమానికి శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటూ జనసేన శ్రేణులు భారీ ఎత్తున విశాఖ పట్టణం చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంలో పోలీసులు జనసేన నాయకులను అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. వైజాగ్ లో మన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు జనసైనికుల అక్రమ అరెస్టులు సబబు కాదని పోలీసులు తీరుపై మండిపడిన పితాని బాలకృష్ణ తక్షణమే జనసైనికుల్ని జనసేన నాయకుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.