Bheemili: గోడపత్రికను ఆవిష్కరించిన డా.సందీప్ పంచకర్ల

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ సమితికి ఆహ్వానం మేరకు వారికి మద్దతుగా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఈ నెల 31న వస్తున్న కార్యక్రమ గోడపత్రికను ఎండాడలో ఉన్న భీమిలి జనసేనపార్టీ కార్యాలయంలో గురువారం భీమిలి ఇంచార్జ్ డా.సందీప్ పంచకర్ల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణాల త్యాగం స్టీల్ ప్లాంట్ అన్నారు. రాష్ట్రానికే మణిహారంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ నిలిచి ఈ నెల 31న భారీ సభ నిర్వహిస్తున్నారని చెప్పారు. అనంతరం జనసేన సీనియర్ నాయకుడు బి.వి.కృష్ణయ్య మాట్లాడుతూ ఈ సభకు జనసైనికులు, ఉక్కు ఉద్యోగులు, కార్మిక, ప్రజా సంఘాలు, నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతిన అనురాధ, నాగోతి అమరావతి నాయుడు, శాఖరి శ్రీనివాస్ మరియు భీమిలి ముఖ్యనాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.