Pendurti: వైజాగ్ సభను విజయవంతం చేయాలని పిలుపు

పెందుర్తి నియోజకవర్గం, అక్కిరెడ్డిపాలెం గ్రామంలో జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర సూచన మేరకు అక్టోబర్ 31న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరుపుతున్న సభను విజయవంతం చేయాలని జనసైనికులును, గ్రామ పెద్దలను, మహిళలను మరియు ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.