శ్రీ గౌరీ పరమేశ్వరుల దేవాలయ ప్రారంభోత్సవంలొ పాల్గొన్న పరుచూరి భాస్కరరావు

అనకాపల్లి: జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు ఆదివారం అనకాపల్లి జిల్లా 83వ వార్డులొ నూతనంగా నిర్మించిన వేల్పులవీధి లొ గల శ్రీ గౌరీ పరమేశ్వరుల దేవాలయం ప్రారంభోత్సవంలొ పాల్గొన్నారు. అనంతరం కొత్తూరు నర్సింగరావు పేటలొ వెంచేసిన శ్రీ మొదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలొ పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలొ జనసేన నాయకులు మంగా ఈశ్వర్, మద్దాల రాంజీ, కరణమ్ నాయుడు, మేడేపల్లి పాపారావు, వేలం పూర్ణ, వీరు, వంశీ మరియు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.