పొన్నూరు జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం

పొన్నూరు టౌన్ 18వ వార్డ్ వివర్స్ కాలనీ నందు జిల్లా జాయింట్ సెక్రటరీ దేశంశెట్టి సూర్య మరియు వివర్స్ కాలనీ జనసైనికులు ఆధ్వర్యంలో జనసేన చలివేంద్రంను జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా వింగ్ కోఆర్డినేటర్ శ్రీమతి బి. పార్వతి నాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు, తాలూరు అప్పారావు, ప్రసాద్, శిఖా బాలు, సతీష్, పొన్నూరు రూరల్ మండల అధ్యక్షుడు నాగి శెట్టి సుబ్బారావు, వీవర్స్ కాలనీ జనసైనికులు పాల్గొన్నారు.