పాతకోట, రేగం రహదారులను తారు రోడ్లుగా నిర్మించాలి

  • అనంతగిరి మండలం జనసేన నాయకుడు మురళి డిమాండ్

అనంతగిరి: పాతకోట, రేగం, రహదారులను త్వరగా తారు రోడ్డుగా నిర్మించాలని అనంతగిరి మండలం జనసేన పార్టీ నాయకుడు మురళి డిమాండ్ చేశారు.. ఈ సందర్బంగా మురళి మాట్లాడుతూ.. అనంతగిరి మండల కేంద్రము నుండి మాలింగ వలస, పాతకోట, రేగం, నందిగుమ్మి, మద్ది గరువు, వయా పెదబయలు గ్రామాలను అనుకొని నిర్మిస్తున్న రోడ్డును త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతతో రోడ్డు నిర్మించాలని అనంతగిరి జనసేన పార్టీ నాయకులు, మురళి, నవీన్, ప్రవీణ్, రామారావు బుధవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. గత ప్రభుత్వ హాయంలో ఈ రింగ్ రోడ్డు కొరకు నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు మంజూరయ్యాయని అప్పటి అధికారులు కాంట్రాక్టర్లు కలిసి రోడ్డు మధ్యలో వదిలేసి నిధులన్నీ కాజేశారని, అలాగే మధ్యలో కల్వర్టు కూడా నిర్మించకుండా వదిలేయడంతో ఆయా గ్రామాల గిరిజనులు నిత్యావసర సరుకుల కోసం మండల కేంద్రానికి రావటానికి నానా అవస్థలు పడుతున్నారని అత్యవసర వైద్య సేవలు నిమిత్తం ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయత్నిస్తున్నారని నాయకులు విమర్శించారు. ఇప్పటికైనా ఈ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మండల కేంద్రానికి రావటానికి సుమారుగా ఒక వంద గ్రామాల గిరిజనులకు సమయం ఆదా అవుతుందని సుమారుగా ఒక 30 కిలోమీటర్లు మండల కేంద్రానికి రావటానికి దగ్గరవుతుందని నాయకులు తెలిపారు. జగన్ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ రోడ్డు పనులు జరగకపోవడంతో గిరిజనులపై జగన్ సవతి ప్రేమ చూపిస్తున్నారు అని నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు అధికంగా పాల్గొన్నారు.