పాము కాటుతో మృతి చెందిన నిరుపేద రైతు కుటుంబాన్ని పరామర్శించిన వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం: ఏర్పేడు మండలం, అంజిమేడు గ్రామానికి చెందిన నిరుపేద రైతు తాతే కాల్వ ప్రతాప్ రెడ్డి ఇటీవల పాము కాటుతో మృతి చెందడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులను నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా బుధవారం పరామర్శించి, ధైర్యం చెప్పడం జరిగింది. నిరుపేద రైతు కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, తాతే కాల్వ ప్రతాప్ రెడ్డి ఇద్దరు పిల్లల చందువుల బాధ్యత తీసుకుంటామని కుటుంబ సబ్యులకు వినుత కోటా మాట ఇవ్వడం జరిగింది.