జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ పోస్టర్ ఆవిష్కరణలో భాగంగా జగ్గంపేటలో ఆవిష్కరించిన పాటంశెట్టి

  • నియోజకవర్గాల వారీగా “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” జనంలోకి జనసేన పోస్టర్ల పంపిణీ కార్యక్రమం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట, “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసును మరియు జనసేన అధినేత చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలలోనికి బలంగా తీసుకెళ్ళేందుకు రూపొందించిన జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ గా జనసేన సింబల్ గాజు గ్లాసుతో కూడిన 15000 పోస్టర్లను ప్రచురించి కొన్ని నియోజకవర్గాలకు పంపిణీ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాల ఇంచార్జుల చేతుల మీదుగా పోస్టర్లను ఆవిష్కరించే కార్యక్రమంలో భాగంగా గురువారం జనసేన పార్టీ జగ్గంపేట ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేటలో “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” రూపొందించిన 3 రకాల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గంపేట జనసేన నాయకులు, జనసైనికులు, శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నాయుడు నిమ్మకాయల మరియు స్వామి రాజా పాల్గొనడం జరిగింది.