తలసేమియాతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్ధికసాయం చేసిన పవనసేన సేవాసంస్థ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపుమేరకు ఇచ్చాపురం మండలం డోంకురు లష్మిపురం గ్రామానికి చెందిన దున్న లోహిత్ అనే బాబూ గత కొద్దీ రోజులుగా తలసేమియాతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం వ్హేయించుకోలేక దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయమని వేడుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవనసేన సేవా సంస్థ సభ్యులు వలబా జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి గురువారం పవనసేన సేవాసంస్థ సభ్యులతో కలిసి డోంకురు గ్రామానికి చేరుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు మీకు మేము ఉన్నామంటూ భరోసా ఇస్తూ వాళ్లలో మనోధైర్యాన్ని పెంచి వాళ్ళ కుటుంబసభ్యులకి మెరుగైన వైద్యం కోసం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసైనికులు, పవనసేన సేవాసంస్థ సభ్యులు పాల్గొన్నారు.