గవర్నర్ అబ్దుల్ నజీర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ను సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించినందుకు జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పరిస్థితులపై గవర్నర్ తో అరగంటకుపైగా చర్చించారు. పవన్ కళ్యాణ్ వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.