శ్రీ అబ్దుల్ నజీర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారితో సోమవారం సాయంత్రం జరిగిన మర్యాదపూర్వక భేటీ ఎంతో విలువైనదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, రాజ్యాంగ నిపుణులైన శ్రీ అబ్దుల్ నజీర్ గారి అనుభవం, మార్గదర్శకత్వం కచ్చితంగా రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుందని విశ్వసిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.