అగ్నికుల క్షత్రియ, బీసీ కుటుంబాలన్నిటికీ పవన్ కళ్యాణ్ అండగా ఉంటారు

  • రాజోలు నియోజవర్గ జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజవర్గం, మలికిపురం గ్రామంలో రాజోలు నియోజకవర్గ అగ్నికుల క్షత్రియులు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజేశ్వర రావు మాట్లాడుతూ వారి కష్టసుఖాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో మాట్లాడుతూ “మన రాష్ట్రంలో మత్స్యకారు కుటుంబాలకి ఈ జగన్ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తున్నదని ఇక్కడ 6700 వేటకెళ్లే మత్యకార కుటుంబాలుంటే కేవలం 820 కుటుంబాలకే మత్యకార భరోసా ఇస్తున్నారంటే ఎంత బాధాకరమో ఆలోచించాలని కోరారు. మన రాజోలు నియోజకవర్గంలో అయితే ఒక్క కోల్డ్ స్టోరేజ్ కూడా లేదు. ఒక్క ఫిష్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ లేదు. వేట లేని (హాలిడే) సమయంలో మీ అందరిని ఆదుకోవాలనే ఆలోచన లేదు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటారు. మీరందరూ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండి వచ్చే మన ప్రభుత్వంలో కోల్డ్ స్టోరేజ్ లు, ఫిషింగ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు పెట్టుకుని ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడడమే మా పవన్ కళ్యాణ్ గారి ఆశయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బొంతు సాయి వెంకట్, అగ్నికుల క్షత్రియ యూత్, విప్పర్తి సాయి, అడబాల సిరి పాల్గొన్నారు.