పుంగనూరు జనసేన-టీడీపీ సమన్వయ సమావేశం

పుంగనూరు నియోజకవర్గం జనసేన-టీడీపీ సమన్వయ సమావేశం శనివారం ఈడిగపల్లిలో నిర్వహించడం జరిగింది. పుంగనూరు నియోజకవర్గం జనసేన నియోజకవర్గ ఇంచార్జి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సీరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) మరియు టీడీపీ ఇంచార్జ్ చల్లా బాబుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జనసేన టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా వచ్చిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షలు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమావేశం చూసాక ఉమ్మడి పార్టీల గెలుపు మీద నమ్మకం కలిగింది అని అన్నారు. ఇరు పార్టీల నాయకులు చర్చించుకున్న అనంతరం గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి వరకు జనసేన టీడీపీ సమన్వయంతో ముందుకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.