జె.పి.నడ్డాతో పవన్ కళ్యాణ్ చర్చలు

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా గారితో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశమయ్యారు. గురువారం ఉదయం ఢిల్లీలో నడ్డా నివాసంలో విస్తృత చర్చలు సాగాయి. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం సాగింది. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అనుసరించాల్సిన ప్రణాళికలు గురించి ఈ భేటీలో మాట్లాడుకున్నారు. రాష్ట్రంలో పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.