నెల్లిమర్ల నియోజకవర్గంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

నెల్లిమర్ల నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంట్లాం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరుమీద నియోజకవర్గ నాయకులు లోకం మాధవి, ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగాపురం మండలంలోని ముంజేరు పంచాయతీ రెల్లి పేట, భోగాపురం గ్రామంలోని రెల్లి వీధిని సందర్శించారు. అక్కడ ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారికి రెల్లి కులస్తులపై ఉన్న ప్రేమ అభిమానం వారికి తెలియజేశారు. భోగాపురం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పళ్ళ రాంబాబు, పల్లంట్ల జగదీష్ ఆధ్వర్యంలో కేకును కట్ చేశారు. అలాగే కొండరాజుపాలెం, నెల్లిమర్ల మండలంలోని గుషిని మరియు డెంకాడ మండలంలోని చింతలవలస గ్రామాలలో జనసైనికులు నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో మాధవి పాల్గొన్నారు. భోగాపురం గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం వద్ద భవన్ నిర్మాణ కార్మికులతో కలిసి ఆమె భోజనాలు చేశారు. పవన్ కళ్యాణ్ వారికోసం చేసిన పోరాటాన్ని కార్మికులకి వివరించారు. అలాగే పూసపాటిరేగమండలంలోని కస్తూరిబా పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న విద్యార్థినులకు పుస్తకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లంట్ల జగదీష్, పళ్ళ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.