క్యాన్సర్ బాధితునికి ఆర్ధికసాయమందించిన పవన్ సేన సమితి

ఇచ్చాపురం: పాయితేరు గ్రామానికి చెందిన మదే కేశవ బెహరా నోటి క్యాన్సర్ తో గత కొంత కాలంగా బాధపడుతున్నారు. వారి పరిస్థితి చూసి ఆ గ్రామానికి చెందిన జనసైనికుల సమాచారం మేరకు పవన్ సేన సమితి తరపున చెరో 5000 రూపాయలను జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీతిప్పన దుర్యోధన రెడ్డి సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా పవన్ సేన సభ్యులు మాట్లాడుతూ ఇలానే ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న సమస్యలు ఆ గ్రామ జనసైనికులు సాయంతో తీరుస్తామని హామీ ఇవ్వడంజరిగింది.