దిగ్విజయంగా కొనసాగుతున్న పవనన్న ప్రజా బాట

  • కరపత్రాలను అందజేసిన జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రామయ్య

ఒంటిమిట్ట: పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రజల ఆశీర్వాదంతో రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతూ 40 రోజులు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాధవరం పంచాయతీలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాఠాల రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేకత విధానాలను అవలంబిస్తున్న వైసిపి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ప్రజల సమస్యలు శాశ్వతంగా తొలగిపోవాలంటే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రావాలని ఆయన అన్నారు. వచ్చే 2024 సంవత్సర ఎన్నికల్లో ప్రజలంతా జనసేన పార్టీకి మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు శ్రీరాందాస్ రమ, నరసమ్మ, లోక, లక్షిమిదేవి, గౌరి, మల్లేశ్వరి, పాల్గొన్నారు.