పరుచూరి భాస్కరరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ గ్రామ కమిటీల ఆత్మీయ సభ
ఆదివారం అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం జనసేన పార్టీ గ్రామ కమిటీల ఆత్మీయ సభ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగినది. ఈ సభకు రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మండలంలో ఉన్న గ్రామ కమిటీల అధ్యక్షులు మాట్లాడుతూ తమ గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి వివరించడంతో పాటు పార్టీ బలోపేతానికి తాము చేస్తున్న కృషి తెలియజేసారు. అనంతరం పరుచూరి భాస్కరరావు మాట్లాడుతూ జనవరి నెల నుండి గ్రామాల్లో ప్రతీ ఇంటికి జనసేన కార్యక్రమం మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేసేందుకు వినూత్నమైన పద్దతిలో వెళ్ళనున్నట్లు తెలిపారు. దానికి సంబంధించి సంక్రాంతి తరువాత ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే జనవరి 12 న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరగబోయే యువశక్తి బహిరంగ సభకు ప్రతీ గ్రామంలో ఉన్న విద్యార్థులు, యువకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు జనసేనలోకి చేరారు. వారికి భాస్కరరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గం నాయకులు సిరిపురపు రమేష్, లీగల్ సెల్ సభ్యులు కరణం కళావతి, కశింకోట మండలం నాయకులు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.