పవనన్న ప్రజాబాట విజయోత్సవ ర్యాలీ

రాజంపేట: పట్టణంలో జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట విజయోత్సవ ర్యాలీ ఆదివారం మన్నూరు శివారు ఎల్లమ్మ గుడిలో పూజల అనంతరం పాదయాత్రగా వజ్రం కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా జనసేన యువత బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరుమండలాల జనసేన నేతలు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని రాజంపేట ప్రజల అభివృద్ధి సంక్షేమ లక్ష సాధన కోసం మీ ముందుకు వస్తున్నానని ఆదరించి ఆశీర్వదించాలని వెల్లడించారు. ఇంకా నాయకులు చాలామంది ఉన్నారని వారిని కొందరు లోకల్ గా ఉన్న నాయకుల తొక్కేస్తున్నారని వారినందర్నీ గుర్తించి పవన్ కళ్యాణ్ గారు జనసేన అని ఒక మంచి ప్లాట్ఫారంగా చేయాలని మలిశెట్టి వెంకటరమణ అన్నారు. జనసేన పార్టీ కోసం చాలామంది కృషి చేస్తున్నారని వారిని కచ్చితంగా గుర్తిస్తారని, పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారని తప్పకుండా అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా అందరిని కూడా గుర్తించి జనసేన దీటుగా నిలబడి గెలుస్తుందని మలిశెట్టి వెంకటరమణ తెలిపారు.