పెంకె వెంకటేష్ కు భీమా చెక్కు అందజేసిన పితాని

ముమ్మిడివరం మండలం, మట్టాడిపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు పెంకె వెంకటేష్ ఇటీవల ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడైనందున హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 50,000 రూపాయల జనసేన పార్టీ భీమా చెక్కు విడుదల చేశారు. ఈ చెక్కును జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, పెంకే వెంకటేష్ కి, వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, రామాయణం మనేశ్వరరావు, మాదాల శ్రీధర్, పితాని రాజు, యలమంచిలి బాలరాజు, దంగేటి శ్రీను, విత్తనాల రామ్మోహన్ రావు మొదలగు వారు పాల్గొన్నారు.