అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన పెనుమాల జాన్ బాబు

పి.గన్నవరం నియోజకవర్గం, అయినవిల్లి మండలం, వెలువలపల్లి గ్రామంలో ఇటివల బూల గంగాజలం ఇల్లు అగ్నికి ఆహుతి అవడం జరిగింది. కావున వారి కుటుంబానికి జనసేన నాయకులు పెనుమాల జాన్ బాబు రూపాయలు 5000/- నగదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మద్ద చంటి బాబు, మండల అద్యక్షులు పోలిశెట్టి రాజేష్, తోట శ్రీను, సలాది బుచ్చిరాజు, తోలేటి ఉమా, గోకరకొండ సత్యనారాయణ (జి.ఎస్), వీరన్నబాబు, కాకిలేటి సత్తిబాబు, సవరం నాయుడు, మేడిశెట్టి నాగబాబు, అమరా నానాజి, విల్లా చలపతి, సలాది బద్రం, అంబటి రాజు, పురంశెట్టి అరుణ్ తధితరులు పాల్గొన్నారు.